![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/DUMPING-YARDFF.jpg?fit=729%2C364&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది నీరుగారుస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం చెత్తను డంపింగ్యార్డుకు తరలించకుండా హైస్కూల్ పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడేస్తున్నారు. ఈ చెత్తతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ కి మొరపెట్టుకున్నా ట్రాక్టర్ పెట్టడం లేదు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.