Breaking News

చంద్రబాబూ.. డ్రామాలు ఆపు

సారథిన్యూస్​, అమరావతి: అమరావతిపై పోల్​ పేరిట మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తనాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారన్నారు. అమరావతి పేరుమీద చంద్రబాబు దొంగపోల్స్‌ పెడుతున్నారన్నారు. పచ్చ మీడియా నిర్వహించే పోల్స్​లో ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఎలా వ్యవహరించారో ప్రజలింకా మరిచిపోలేదన్నారు.

తన ఎత్తుగడలతో ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు దుష్టపన్నాగాలు పన్నుతున్నారని.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సజ్జల హితవు పలికారు. అవసానదశలో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. కుట్రలు మానేయాలని సూచించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. విశాఖ, కర్నూల్​పై ద్వేషాన్ని చిమ్మకుండా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని కోరారు.