Breaking News

గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్​నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్​రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్​ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్​ పార్టీయే పాలించిందన్నారు. జూబ్లీహిల్స్​ కమలానగర్​లో 210 ఇండ్లు, సారథినగర్​లో 160 ఇళ్లు కడుతున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్​కు కాంగ్రెస్​ నేతల సర్టిఫికెట్​అవసరం లేదన్నారు.