Breaking News

‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: శ్రీవారి సముద్రం సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ కోసం రూ.147కోట్లు మంజూరుచేసి ఆమోదం తెలిపినందుకు  సీఎం కేసీఆర్ కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ పట్టణంలోని టీఆర్​ఎస్​ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు..

చిన్నంబావి, వీపనగండ్ల, పాన్ గల్ మండలాల రైతులకు జూరాల నుంచి గతంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయని విజ్ఞప్తి చేయడంతో సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె రిజర్వాయర్ కోసం గతంలో 2018 సెప్టెంబర్ 5న జీవోనం.1079 ద్వారా డీపీఆర్​ జీవో విడుదల చేశారని చెప్పారు. సర్వే పనుల కోసం గతంలోనే నిధులు విడుదల చేశామన్నారు.