సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్కర్నూల్జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర […]
సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీవారి సముద్రం సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ కోసం రూ.147కోట్లు మంజూరుచేసి ఆమోదం తెలిపినందుకు సీఎం కేసీఆర్ కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని టీఆర్ఎస్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.. చిన్నంబావి, వీపనగండ్ల, పాన్ గల్ మండలాల రైతులకు జూరాల నుంచి గతంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయని విజ్ఞప్తి చేయడంతో సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేపట్టి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా కొల్లాపూర్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జూపల్లి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. యువత సామాజిక సేవా స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ […]