Breaking News

కలెక్టర్ మార్నింగ్​ వాక్​

కలెక్టర్ మార్నింగ్​ వాక్​

సారథి న్యూస్​, అచ్చంపేట: సడెన్ వచ్చి కారు ఆగింది.. అందులో నుంచి ఎవరో దిగారు.. సమీప షాపులు, ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చారని తెలుసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తమయ్యారు.. ఆయన ఎవరో కాదు నాగర్​ కర్నూల్ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​. శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మార్నింగ్​ వాక్​ నిర్వహించారు. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు పుట్ పాత్ పై ఉన్న వ్యాపారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు బాగుండాలని సూచించారు. ఇలా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ తరచూ జిల్లాలోని అన్ని పట్టణాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు.