సారథి న్యూస్, అచ్చంపేట: సడెన్ వచ్చి కారు ఆగింది.. అందులో నుంచి ఎవరో దిగారు.. సమీప షాపులు, ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చారని తెలుసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తమయ్యారు.. ఆయన ఎవరో కాదు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్. శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు పుట్ పాత్ పై ఉన్న వ్యాపారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు బాగుండాలని సూచించారు. ఇలా కలెక్టర్ ఎల్.శర్మన్ తరచూ జిల్లాలోని అన్ని పట్టణాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
- August 7, 2020
- Archive
- Top News
- మహబూబ్నగర్
- యువలోకం
- ACHAMPET
- COLLECTOR SHARMAN
- L.SHARMAN
- అచ్చంపేట
- కలెక్టర్
- నాగర్కర్నూల్
- Comments Off on కలెక్టర్ మార్నింగ్ వాక్