Breaking News

కరోనా వచ్చిందంటూ దుష్ప్రచారం

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్​హెచ్​వో డాక్టర్​ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్​ శంకర్​నాయక్​ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. డీఎమ్​హెచ్​వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్​ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్​ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్​ వచ్చన రిపోర్టులను శంకర్​నాయక్​ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్​హెచ్​వో పనితీరు సక్రమంగా లేదని ఆమె పనితీరు వల్ల కరోనా బాధితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. తప్పుడు సమాచారం చేరవేస్తూన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.