Breaking News

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, అలంపూర్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా బుధవారం అలంపూర్ మున్సిపాలిటీలో డ్రోన్​ సాయంతో సోడియం హైపో ద్రావకాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్​ వెంకటేశ్​ మాట్లాడుతూ..

ప్రతివార్డులో 20 లీటర్ల చొప్పున పది వార్డులకు రెండొందల లీటర్ల ద్రావకాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు వివరించారు. అందుకోసం రోజుకు రూ.20వేలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సుష్మారావు, అల్లాబకాష్, సమీర్, గంగిరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.