![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/SUPRIME-COURTTFF.jpg?fit=700%2C394&ssl=1)
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున కోర్టు జోక్యం చేసుకొని బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించాలని పిటిషనర్ అవినాశ్ రాకూర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. కాగా అతడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది.