షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ 67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఎస్ఏ యాదవ్ 27 (18 బంతులు, 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా 28 (19 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్స్లు), ఇషాన్ కిషన్ 31 (23 బంతుల్లో, ఒక ఫోరు, 2 సిక్స్లు), హెచ్హెచ్ పాండ్యా 28 (19 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్స్లు), కేఏ పొలార్డ్25 (13 బంతుల్లో, 3 సిక్స్లు), కేహెచ్ పాండ్యా 20 (4 బంతుల్లో, 2 సిక్స్లు, 2 ఫోర్లు) పరుగులతో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్శర్మ 2, ఎస్ కౌల్ 2, రషీద్ఖాన్ ఒక వికెట్ చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. 60 (44 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్టో 25 (15 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఎంకే పాండే 30 (19 బంతుల్లో, 4 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. వియమ్సన్ 3, ప్రియమ్గార్గ్ 8, అభిషేక్శర్మ10, అబ్దుల్ సమద్ 20, రషీద్ఖాన్ 3 పరుగుల చొప్పున.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్ 2, పాటిస్సన్ 2, కేహెచ్పాండ్యా ఒకటి, జేజే బుమ్రా 2 వికెట్ల చొప్పున తీశారు.
- October 4, 2020
- Archive
- Top News
- క్రీడలు
- MUMBAI INDIANS
- SHARJHA
- SUNRISERS
- ముంబై ఇండియన్స్
- షార్జా
- సనరైజర్స్
- హైదరాబాద్
- Comments Off on ‘హైదరాబాద్’ పరాజయం