Breaking News

‘హైదరాబాద్’​ పరాజయం

‘హైదరాబాద్’​పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 ఫోర్లు), హార్దిక్ ​పాండ్యా 28 (19 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్స్​లు), ఇషాన్ ​కిషన్ ​31 (23 బంతుల్లో, ఒక ఫోరు, 2 సిక్స్​లు), హెచ్​హెచ్ ​పాండ్యా 28 (19 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్స్​లు), కేఏ పొలార్డ్​25 (13 బంతుల్లో, 3 సిక్స్​లు), కేహెచ్ ​పాండ్యా 20 (4 బంతుల్లో, 2 సిక్స్​లు, 2 ఫోర్లు) పరుగులతో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. ఇక సన్​రైజర్స్ ​హైదరాబాద్ ​బౌలర్లలో సందీప్​శర్మ 2, ఎస్​ కౌల్ ​2, రషీద్​ఖాన్ ​ఒక వికెట్​ చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్​ ​ఒంటరి పోరాటం చేశాడు. 60 (44 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. బెయిర్ ​స్టో 25 (15 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్​లు), ఎంకే పాండే 30 (19 బంతుల్లో, 4 ఫోర్లు, ఒక సిక్స్​) పరుగులు చేశాడు. వియమ్సన్​ 3, ప్రియమ్​గార్గ్​ 8, అభిషేక్​శర్మ10, అబ్దుల్​ సమద్​ 20, రషీద్​ఖాన్​ 3 పరుగుల చొప్పున.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ముంబై ఇండియన్స్​ బౌలర్లలో బౌల్ట్​ 2, పాటిస్సన్ ​2, కేహెచ్​పాండ్యా ఒకటి, జేజే బుమ్రా 2 వికెట్ల చొప్పున తీశారు.