సారథి న్యూస్, కర్నూలు: పశ్చిమప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు తుంగభద్ర నదిలోకి వరద నీరు తరలివస్తోంది. మంత్రాయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతంలో కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం అధికం కావడంతో బుధవారం కేసీ కెనాల్ ఏఈ శ్రీనివాస్రెడ్డి సుంకేసుల బ్యారేజీ నుంచి వెయ్యి క్యూసెక్కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉండడంతో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు సుంకేసుల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. దీంతో కర్నూలు నగరంలో తాగు, సాగునీటి సమస్యకు పరిష్కరించామన్నారు. కేసీ కాల్వ ద్వారా శ్రీశైలం డ్యాంకు నీరు చేరుతుందన్నారు.
- July 22, 2020
- Top News
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- KC CENAL
- Kurnool
- SUNKESULA
- కర్నూలు
- కేసీ కెనాల్
- తుంగభద్ర
- సుంకేసుల
- Comments Off on సుంకేసుల నుంచి నీటివిడుదల