![శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/HOME-1.jpg?fit=677%2C399&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల కోసం అధిక నిధులు మంజూరు చేసిందని చెప్పారు. గురువారం యూసుఫ్ గూడ మొదటి బెటాలియన్ లో జరిగిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఆదర్శంగా ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాంతిభద్రతలో పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని ఇందుకుగాను పోలీసుశాఖ గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక నిధులు కేటాయించామని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, బెటాలియన్ ఏడీజీ అభిలాష బిస్టా అన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/HOME22.jpg?resize=640%2C337&ssl=1)