Breaking News

రాష్ట్రంలో​ రజాకార్ల పాలన

సారథి న్యూస్​, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని సీపీఐ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ నేతలు కరీంనగర్​ జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చినవారిలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్​, నాయకులు టీ మల్లయ్య, కే రాజారత్నం, టీ రమేశ్​ కుమార్​, రేణిగుంట ప్రీతం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.