Breaking News

రాయితీతో కల్లాల నిర్మాణం

సారథిన్యూస్, రామడుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్​ పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోటానికి ఈ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కల్లాలకు చిన్న సన్నకారు రైతులు అర్హులని పేర్కొన్నారు. 50 చ.మీ కల్లాలకు రూ. 56 వేలు, 60 చ. మీ రూ. 68 వేలు, 75 చ.మీ రూ. 85వేలు నిర్ధారించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, జనరల్ కు 90 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, ఆధార్ కార్డు, పట్టేదారు పాస్ బుక్, బాంక్ అకౌంట్, జిరాక్స్ ల తో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.