Breaking News

మొత్తం కేసులు @ 30 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 69,239 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరుకున్నది. నిన్న ఒక్కరోజే 912 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారిసంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 కు చేరింది. ప్రస్తుతం 7,07,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.69 శాతంగా ఉందని తెలిపింది.