![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/SINGHARENIIIIIII.jpg?fit=1203%2C423&ssl=1)
సారథి న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్ కాస్ట్ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు రరేశ్, ఏఐటీయూ ఎస్సీడబ్ల్యూయూ పాల్గొన్నారు.