![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/vanarams.jpg?fit=557%2C297&ssl=1)
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.