![బస్తీ దవాఖాన ప్రారంభం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ktr-2f-3.jpg?fit=677%2C446&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ఓల్డ్సిటీ పరిధిలోని సంతోష్నగర్లో బస్తీదవాఖానను మంత్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్అలీ శుక్రవారం ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వారు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషాఖాద్రి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.