Breaking News

ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

సారథి న్యూస్, కర్నూలు: ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎంపిక కోసం దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన 12 మంది జిల్లా కలెక్టర్లలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర కేబినెట్ సెక్రటరీ బృందానికి కలెక్టర్​ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్, పాలన సంస్కరణల శాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) సతీష్ కె.జాదవ్ రాసిన లేఖను ఈ-మెయిల్ ద్వారా శుక్రవారం సాయంత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​కు పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎస్పీ డాక్టర్​కె.ఫక్కీరప్ప, జేసీలు రవిపట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, జిల్లా అధికారుల సంఘం నేతలు, మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.