![ప్రణబ్ముఖర్జీకి కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRANABH-MUKARJEEFFF-2.jpg?fit=700%2C393&ssl=1)
ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.