![పేషెంట్లకు వైద్యం బాగుండాలె](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/etala-2f.jpg?fit=677%2C335&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి టీమ్స్ ఆస్పత్రిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ప్రతి ఫ్లోర్, రూమ్ ను చాలాసేపు పరిశీలించారు. పేషెంట్ల పట్ల కేర్, వారికి మందులు, వైద్యం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్క్వాలిటీ బాగుండాలని సూచించారు. వైద్యచికిత్సల కోసం అవసరమైనంత మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న సీపీఎం నేత, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డిని మంత్రి పరామర్శించారు.