![దుర్గామాత చల్లంగా చూడు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/bjply-2-1.jpg?fit=677%2C366&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పాలెం వెంకటేశ్వర ఆలయం సన్నిధిలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్, పద్మావతి మాతృ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారికి భక్తులు విశేషపూజలు చేశారు. రోజుకొక పూజతో దుర్గామాతను కొలుస్తున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ సురేందర్, సూర్యకళ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, జగదీశ్, వెంకటేష్, ఆనంద్ సింగ్ , మోహన్, పూజారి జయంత్ శర్మ, కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామయువకులు పాల్గొన్నారు.