Breaking News

తెలంగాణలో 1,986 కేసులు

తెలంగాణలో 1,986 కేసులు,

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 62,703కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 16,796 ఉన్నాయి. జిల్లాల వారీగా..అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 29, జనగాం 21, జోగుళాంబ గద్వాల 32, కామారెడ్డి 46, కరీంనగర్ ​116, ఖమ్మం 41, మహబూబ్​ నగర్​ 61, మహబూబాబాద్​37, మంచిర్యాల 35, మెదక్​ 45, మేడ్చల్​ 207, ములుగు 27, నాగర్​కర్నూల్​ 30, నల్లగొండ 36, పెద్దపల్లి 26, సిరిసిల్ల 23, రంగారెడ్డి 205, సంగారెడ్డి 108, సిద్దిపేట 20, వనపర్తి 18, వరంగల్​అర్బన్​123 చొప్పున కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్​ను విడుదల చేసింది.