![డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/dindi-2.jpg?fit=933%2C820&ssl=1)
సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ ఎల్.శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్ డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటికి రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/coll-2.jpg?resize=640%2C380&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/sp-2.jpg?resize=640%2C413&ssl=1)