![జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/TULASI-2.jpg?fit=677%2C268&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.బుధవారం డోన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రిగా అనర్హుడని విమర్శించారు. శక్తికి మించి అప్పులు చేయడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం జగన్ మోహన్రెడ్డి 15నెలల పరిపాలన కాలంలోనే రూ.1.25లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇమిడి సాయి, జిల్లా కార్యదర్శి ఉన్నిగొర్ల జనార్ధన్ యాదవ్, మరిశెట్టి సునీత, శేషయ్య, అశోక్ రత్నం, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్ ఉన్నారు.