Breaking News

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అదేస్థాయిలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. మంగళవారం 1,524 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 37,745 కు కరోనా కేసులు చేరాయి. తాజాగా మహమ్మారి బారినపడి 10 మృతిచెందారు. చికిత్స అనంతరం ఒకేరోజు 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 815 పాజిటివ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 375కు చేరింది. ఇప్పటివరకు 1, 95, 024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, నల్లగొండ 38, వరంగల్​అర్బన్​30, కరీంనగర్​29, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 15 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి.