![ఏపీలో 9,393 కరోనా కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CARONA-2F-9.jpg?fit=677%2C381&ssl=1)
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గురువారం 9,393 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 3,25,396 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారినపడి 95 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,001గా నమోదైంది. 24 గంటల్లో 55,551 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా వైరస్ బారినుంచి 8,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారు 2,35,218 మంది ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 973, చిత్తూరు 836, ఈస్ట్గోదావరి 1357, గుంటూరు 443, కడప 434, కృష్ణా 195, కర్నూలు 805, నెల్లూరు 588, ప్రకాశం 635, శ్రీకాకుళం 762, విశాఖపట్నం 985, విజయనగరం 385, వెస్ట్గోదావరి 995 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.