![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/PARENTSS-STUDENTSFFG.jpg?fit=700%2C315&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితిని చూసిన గ్రామస్థులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ చిన్నారులను ఆదుకోవాలని.. వారి విద్య, వసతులు కల్పించాలని కోరుతున్నారు.