![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/AKHILLLLLLLLLLFFG.jpg?fit=680%2C417&ssl=1)
అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్డౌన్తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్కు అక్కలా ఉందంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇప్పటికే పూజపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. తాజాగా అఖిల్ షూట్లో జాయిన్ అయ్యాడు. కాగా ‘ఈ కరోనా టైమ్లో రొమాంటిక్-కామెడీని చిత్రీకరించే ప్రయత్నంలో మేమిద్దరం మాత్రమే సామాజిక దూరం పాటించడం లేదు..’ అంటూ పూజ కామెంట్ చేసింది.