![పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/nzpt21.jpg?fit=655%2C337&ssl=1)
సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.