Breaking News

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి.

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట:  పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన  తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు,  పోలీస్ సిబ్బంది పనితీరు,  పరేడ్,  మెయింటినెన్స్,  క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట పోలీసు స్టేషన్  పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ జార్జి. పెద్దశంకరంపేట, రేగోడ్,  ఎస్సైలు నరేందర్.. సత్యనారాయణ,  పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.