సారథి న్యూస్, మెదక్: జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ(ఎస్సీ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఈ ఏడాది 448 మంది లబ్ధిదారులకు రూ.19.18 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో రూ.12.35 కోట్ల సబ్సిడీ కాగా, రూ.6.63 కోట్ల బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ ద్వారా అమలుచేస్తున్న రూ.లక్షలోపు పథకాలకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల్లోపు పథకాలకు […]