సారథి న్యూస్, కర్నూలు: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు చట్టాలు రూపొందించాయని, పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ను ప్రారంభించారు. అందులో భాగంగా నగరంలోని రాజ్విహార్ సెంటర్ నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో ఎస్పీ పాల్గొన్నారు. రెస్క్యూ చేసిన వీధి, అనాథ బాలలకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లను ఎస్పీ పంపిణీ […]