Breaking News

PEDDASHANKARMPET

పెద్దశంకరంపేటలో భారీ శోభాయాత్ర

పెద్దశంకరంపేటలో భారీ శోభాయాత్ర

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో భాగంగా ఆదివారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో ఆదివారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నేత సంగమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెద్దశంరంపేట వేంకటేశ్వర ఆలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ఈ యాత్ర సాగింది. కాషాయ జెండాలు చేతపట్టి జై శ్రీ రామ్! నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో కరణ్ భారతి మహారాజ్, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More