శ్రీనగర్: పాకిస్తాన్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం మట్టుబెట్టారు. సౌత్ కాశ్మీర్లోని ట్రాల్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టును జాయింట్ ఆపరేషన్లో ఎన్కౌంటర్ చేశామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరికొంత మంది టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి ఇప్పటివరకు మూడు ఎన్కౌంటర్లు జరిగాయని అన్నారు. గతేడాది పుల్వామాలో జరిగిన ఎటాక్ తరహా ప్లాన్ను మన […]