సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ పి.శ్రీనివాస్గౌడ్ గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉజ్వల భవిష్యత్ను ఏర్పాటుచేసుకుని తద్వారా భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారదమ్మ, సర్పంచ్ఎస్.మహేశ్రావు, ఎస్ఎంసీ చైర్మన్బి.యాదయ్య, ఉపాధ్యాయులు భాస్కర్రెడ్డి, జహంగీర్, నాగేశ్వర్ రావు, సుధారాణి పాల్గొన్నారు.