సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా బారినపడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.20వేలు, క్వారంటైన్లో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల సాయం అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టు వివరాలను వెంటనే 8086677444, 9676647807 నంబర్లకు పంపించి సహాయం పొందగలరని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా(కోవిడ్ –19)తో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిచెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారినపడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాతపడడం ఎంతో కలచి వేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ […]