ముంబై: బిగ్ అమితాబచ్చన్ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్తోపాటు ఆయన కుమారుడు అభిషేక్, కోడల్ ఐశ్వర్యరాయ్, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్, అభిషేక్ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.
ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం […]