పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]