‘శివతత్వమే మన తత్వమని, అదే మానవత్వం’ అని బోధించారు మహిమాన్విత మూర్తి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. హైందవ ధర్మాన్ని సంరక్షించుకునేందుకు జన్మించిన అపరశంకరులే ఈ భగవత్పాదువారు. భరతఖండం భిన్నకులాల సమాహారం. ఈ భిన్న కులాలను ఏకత్వం వైపు నడిపి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాపురుషుడు. హిందూధర్మానికి దశ, దిశ నిర్దేశించిన నిర్దేశకుడు ఆది శంకరాచార్యులవారు. ఆస్తికత్వాన్ని స్థాపించి హైందవం అనే మహావృక్షానికి జీవం పోసిన మహానుభావులు. ఇలాంటి అవతార పురుషులు అవతరించిన పుణ్యదినం ఏప్రిల్ 28న […]