సామాజికసారథి, బిజినేపల్లి: స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. వార్డుల విభజన, కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. దసరా తర్వాత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. అధికారులు అంతా రెడీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో బోగస్ ఓట్లు నమోదుచేశారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మేజర్ పంచాయతీ […]