సారథి న్యూస్, రామడుగు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు బావిలో పడి చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మల్లేశం కొడుకు రేవంత్(9) ఆదివారం మధ్యాహ్నం సైకిల్ తొక్కుతూ వెళ్లి ఇంటి ముందున్న బావిలో పడ్డారు. కొడుకు కనిపించడం లేదని వెతికిన తల్లిదండ్రులకు బావిలో శవమై కనిపించాడు. బావి యజమానిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.