Breaking News

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా

సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్​, మంత్రి కొప్పుల ఈశ్వర్​తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్​లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే అని చెప్పారు. సమావేశంలో టీడీజీకేఎస్​ ఉపాధ్యక్షుడు శంకర్, దేవ వెంకటేశం, కృష్ణ, పరస బక్కయ్య, ఎన్ మల్లేష్, జీ శ్రీనివాస్, వీవీ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్, డీ మల్లేశ్​ తదితరులు పాల్గొన్నారు.