![మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/mask.jpg?fit=655%2C313&ssl=1)
హైదరాబాద్: ప్రతిఒక్కరూ మాస్క్ను ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని సూచించింది. విపత్తు నిర్వహణచట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.