Breaking News

మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం

మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం
  • సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు పంపడం దుర్మార్గమన్నారు. గృహ విద్యుత్ పై యూనిట్ కు 50 పైసలు సామాన్య ప్రజానీకానికి భారమవుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శ్రీనివాస్, కె.గీత, మండల కార్యదర్శి అశోక్, జిల్లా నాయకులు నిర్మల శివ వర్మ, రామయ్య, మల్లికార్జున్, హనుమంతు, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.