- ఎస్ఓటీ పోలీసుల దాడులు
- పట్టుబడ్డ 16 మంది పేకాట రాయుళ్లు
- 13.35 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం
సామాజిక సారథి, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి ఫామ్ హౌస్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, పేకాట ఆడుతున్న 16మందిని అదుపులో తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసులతో కలిసి పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు రూ.13.35లక్షల నగదు, 17సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేత రాజు గౌడ్ కి చెందిన ఫామ్ హౌస్ లో పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేసినట్లు వారు తెలిపారు. కొల్లూర్, నాగులపల్లి, శంకర్పల్లి, గజ్వేల్, గండిపేట తదితర ప్రాంతాలకు చెందిన 16 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తుతన్నట్లు పోలీసులు తెలిపారు.