![మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/10/26SMS08.jpg?fit=622%2C350&ssl=1)
- ములుగు ఎమ్మెల్యే సితక్క
సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఇన్ చార్జి కొండేటి మల్లయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.