Breaking News

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం
  • ములుగు ఎమ్మెల్యే సితక్క

సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఇన్ చార్జి కొండేటి మల్లయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.