Breaking News

రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ డైరెక్టర్ బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపీటీసీలు బొప్పిడి గోపాల్, లచ్చిరాం నాయక్, మంజుల చంద్రమౌళి, సర్పంచులు లక్ష్మినరసింహరెడ్డి, యాదయ్య, సులోచన సాయిలు, భారతమ్మ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపసర్పంచులు వెంకటేష్, వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు.