- కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ
వారణాసి: లోక్సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్ఈ 10వ తరగతి సిలబస్తో పాటు పరీక్షలో వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్ఈ సిలబస్లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు మితిమీరిన స్చేచ్ఛ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్ఈ సిలబస్తో పాటు పరీక్షలో క్వశ్చన్రావడంపై సోనియాగాంధీ అభ్యంతరం తెలిపారు. లోక్సభలో సోనియాగాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన క్షణాల్లోనే సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది. టెన్త్క్లాస్సిలబస్తో పాటు ప్రశ్నాపత్రం నుంచి ఆ క్వశ్చన్తొలగిస్తునట్లు స్టేట్మెంట్విడుదల చేసింది. ఈ ప్రశ్నకు సంబంధించి పిల్లలకు ఫుల్మార్కులు ఇస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చింది.